పల్లె పరిసరాలలో బతుకు వనరులు లభ్యం కానప్పుడు దగ్గర్లోని కొండల మీద ఆధారపడటం సహజం. ఉదయం వెళ్లి సాయంత్రం లోపల అటవీ ఉత్పత్తులను సేకరించుకుని వచ్చేవాళ్లు కొందరైతే , వారం పది రోజులపాటు అక్కడే కొండపోలం చేసి బతుకుతెరువు సాధించుకునేవాళ్లు మరి కొందరు. కరువు తాండ విస్తున్నపుడు గొర్రెలను నీళ్లు మేపు వెతుక్కొంటూ ఎక్కడో కొండల్లో నాలుగు చినుకులు రాలి గడ్డి పచ్చబడిన తావులు చేరుకుని క్రూరమృగాల దాడులు తప్పించుకుంటూ ఏడెనిమిది బత్తెల కాలం జీవించిన దుర్భరమైన జీవితం ఈ కొండపోలం నవల.