Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹180

                                           జాంగా హనుమయ్య చౌదరి గారి పౌరాణిక పద్యనాటకం "జానకి పరిణయము" 1928 లో మొదటి ముద్రణ పొందింది. ఈ పునర్ముద్రణకు నేడు పూనుకొన్నవారు రచయిత పౌత్రులు శ్రీ జాంగా శేషగిరి రావు., వారి సోదరులు. నాటక రూపంలో ఉన్న తమ తాతగారిని ఈ తరం పాఠకులకు దర్శనీయం చేస్తున్న రచయిత మనుమలు అభినందనీయులు.

                                             రామాయణంలోని ఆరుకాండల్లో మొదటిది బాలకాండ. ఇందులో రామావతారం మొదలుకొని సీతాకళ్యాణం వరకు గల కథ ఉంది. కావ్యరచనకు సరిపోయే కథ ఇది. ఈ కథను తీసుకొని హనుమయ్య చౌదరి గారు ఏడూ అంకాల నాటకంగా, ప్రదర్శన యోగ్యంగా నిర్మించారు.