Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

      స్వర్గ లోకంలో దేవతలంతా సమావేశం అయ్యారు. అందరి మొహాలలోనూ కలవరం కనబడుతోంది... ఆరోగ్యంగా ఉండవలసిన భూదేవి కలరహితంగా అనారోగ్యంగా కనబడడమే వారి కలవరానికి కారణం. భూదేవిలో కళ తప్పడానికి గల కారణాలు కనిపెట్టి ఆవిడలో పూర్వ కళని తీసుకురావాలన్నది సమావేశ లక్ష్యం.

        సభాసదులంతా ఆశీనులయ్యాక, ఇంద్రుడు వచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు, భూదేవిని సభికులలో నుండి వచ్చి వేదిక మీద ఉన్న ప్రత్యేక సింహాసనాన్ని అలంకరించామని ఆహ్వానించాడు. అడుగు తీసి అడుగు వెయ్యడానికి కష్టపడుతూ, ఆయాస పడుతూ, అతి ప్రయాస మీద వేదికని చేరి సింహాసనంలో ఇరుక్కుని కూర్చుంది భూదేవి. భూదేవి పడుతున్న బాధని చూసి భరించలేకపోయారు సభికులు.

                                                                                                    - డా. గాయత్రీదేవి