Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
సత్యాన్ని కథలలో వాస్తవికత తొణికిసలాడుతూ ఉంటుంది. నాటకీయత ఉండదు. కథ తనంతట తాను కొనసాగుతుంది. పాత్రలు తమ చైతన్యానికి మించి మాట్లాడవు. రచనలో రచయిత సంయమనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒక పేరా రాసి ఒక సూత్రీకరణ చేయడం, మధ్య మధ్యలో సొంత వ్యాఖ్యానాలు చేయడం వంటి బలహీనతలు సత్యాగ్నికి లేవు. ఆయన కథలు పాఠకులు హాయిగా చదువుకుంటారు. తీవ్రంగా ఆలోచిస్తారు.
- ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి,
ప్రసిద్ధ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత.
కథకుడిగా షేక్ హుసేన్ ఆదర్శవాది. పాఠకుడికి ఆత్మీయంగా వుంటూ రసస్పోరకంగా కథ చెప్పడం ఆయన పద్దతి. అందువల్ల ఆయన కథల్ని వొకచోట చదవడం ఉల్లాసమైన వినోదయాత్రలా కూడా వుంటుంది. షేక్ హుసేన్ గారి కథల్ని చదివినప్పుడు హిందువులు ఈ ముస్లిం సమాజం తమదేనని గుర్తిస్తారు. ఆయన కథల్ని చదివిన ముస్లిములు తాము మారాల్సిన అవసరం ఉందని గ్రహిస్తారు. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండి తీరాలనే నమ్మకమున్న షేక్ హుసేన్ గారి కథలు ఆయన కోరుకున్న రీతిలో పాఠకుల్ని ఆకట్టుకుని, కార్యోన్ముఖుల్ని చేస్తాయి. ఆ
ప్రసిద్ధ కథారచయిత