Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200
  1. అన్న ఔదార్యం

పూర్వం పాటలీపుత్రంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారి తండ్రి దూరపు గ్రామంలో ఒక వ్యక్తికి అప్పుగా కొంత డబ్బిచ్చాడు. ఆ తరువాత కొంత కాలానికి చనిపోయాడు. తండ్రి మరణానంతరం ఆ సొమ్ము రాబట్టుకోడానికి అన్నదమ్ములిద్దరూ వెళ్ళి, వసూలు చేసుకున్నారు. వెయ్యి నాణాలు వచ్చాయి. వాటిని ఒక మూటలో కటారు. తిరుగు ప్రయాణంలో వారు గంగానదీ తీరానికి వచ్చారు. తాము ఎక్కాల్సిన నౌక రావడానికి ఇంకా సమయం ఉంది. దాంతో వారు ఆ నది ఒడ్డున కూర్చొని తెచ్చుకున్న అన్నం తిన్నారు. పెద్దవాడు కొంత అన్నాన్ని తీసి, నదిలో చేపలకు ఆహారంగా వేశాడు. ఆ ఇసుక మీదే పంచె పరచుకుని పడుకుని కునుకు తీశాడు.

అన్న నిద్రలోకి పోగానే తమ్మునికి దురాలోచన కలిగింది. వెంటనే గులక రాళ్ళు పోగుజేసి, అంతే బరువుతో, అదే రకం గుడ్డతో మరో మూట కట్టాడు. ఇద్దరూ నావలో ప్రయాణం ప్రారంభించారు. నావ నది మధ్యలోకి వెళ్లగానే అన్న ఆదమరచి ఉండడం తమ్ముడు గమనించాడు. నాణేల మూటను దాచి, తన దగ్గరున్న గులకరాళ్ల మూటను నీటిలోకి పడేశాడు.

"అయ్యో! అన్నా! నాణాల మూట జారిపోయింది" అంటూ లబోదిబోమన్నాడు. బోధి సిరులు • బొర్రా గోవర్ధన్