సంగీతపు మధురిమలు, సాహిత్యపు చాతురిమలను ఆత్మనుభూతి ప్రగాఢత్వపు గరిమలను కలనేసి విలక్షణమైన వాణితో తనదొక ప్రత్యేకబాణిగా మలచుకొని తెలుగు సాహిత్య జగత్తులో విరాజిల్లుతున్నారు దేవులపల్లి కృష్ణ కవిచంద్రులు ఉజ్వల యాశస్సంద్రులై భావాకవితారామాంలో తియాగా గొంతెత్తిన కృష్ణశాస్త్రి భావకవిత్వాన్నోక ఉద్యమంగా కొన్ని దశాబ్దాలపాటు నడిపి భావకువులకు ప్రతినిధిగా నిలిచి, భావకవి సార్వభౌముడిగా సంభవించబడ్డాడు. నాటి సంప్రదాయవాదులు కర్కశ కాశఘాతాలకు ఎదురొడ్డి నిలిచి సంఘ సంస్కరణోద్యమాలలో పాల్గొన్న మేరు నగధీరుడు.