Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹40

               తెలంగాణం నిజం పాలనకింద అనేకరకాలుగా అణిచివేతకు గురైంది. మెజారిటీ ప్రజలను మైనారిటీ వార్గం దౌర్జన్యకాండతో పాలించింది. ప్రజల గొంతు నొక్కింది. స్వాతంత్య్రం హరించింది. చదువు సంధ్యలకు దూరంచేసింది. ప్రతి ముస్లిమేతరుడు బానిసనన్న భావనలో కూరుకుపోయి, బతుకులీడ్చుకొనేలా చేసింది నిజాం దుష్టపాలన.

                   అలాంటి దశలో తెలుగు ప్రజల్లో నవచైతన్యాన్ని నింపి ఉద్యమపంథా - అది ఏ రంగమైనా సరే - పట్టటానికి అనేకులు తమ జీవితాలను అంకితం చేశారు. వాళ్ళే తెలంగాణ వైతాళికులు. అలాంటి వారిలో "ఆదిరాజు వీరభద్రరావు"గారు గణనీయులు. వారి కృషి అనేకానేక కారణాల వల్ల తెలియవలసినంతగా ప్రజలకు తెలియలేదు.