ఆదిమ కమ్యూనిజం , బానిస వ్యవస్థ, భూస్వామ్యవ్యవస్థ అను సామజిక దశలు, భారత సమాజ పరిణామంలో సైతం ఉన్నాయని సాధికారికంగా నిరూపించిన మొట్టమొదటి మార్క్సిస్టు పరిశోధక గ్రంధం ఇది. "యజ్ఞం " అను మాటకు శ్రీ డాంగే గారిచ్చిన అర్ధం, మార్క్సిజాన్ని సృజన శీలంగా భారత పరిస్థితులకు వర్తింప చేయటంలో వారి ప్రతిభకు తార్కాణం. భారత చరిత్రను శాస్త్రీయదృష్ట్యా అర్ధం చేసుకోదలచిన ప్రతి ఒక్కరు తప్పక అధ్యయనం చేయవలసిన గ్రంధం ఇది.