డా|| సి.భవానీదేవి స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పదవి భాద్యతలు నిర్వహిస్తున్నారు.
నాలుగు దశాబ్దాల రచన వ్యాసరంగంలో 9 కవిత సంపుటాలు, 2 కథ సంపుటాలు, 2 విమర్శ వ్యాస సంపుటాలు మొదలైన 25 గ్రంధాలు రచించారు.
పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి నాళం కృష్ణారావు స్మారక ధర్మనిధి పురస్కారం, "వర్ణనిసి" కావ్యానికి ఉత్తమ కవితా పురస్కారం, "శబ్దస్పర్మ" కు ఉమ్మడిశెట్టి సాహితి అవార్డు, రంజని "కందుర్తి" అవార్డు, అబ్బూరి రుక్మిణమ్మ స్మారక ఉత్తమ రచయిత్రి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది కవి పురస్కారం, ఆచార్య తిరుమల స్మారక కవిపురస్కారం , డాక్టర్ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కవితా పురస్కారం రచయిత్రికి లభించిన గౌరవాల్లో కొన్ని.